నివాళులు అర్పించిన మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి..
మహేశ్వరం నియోజకవర్గంలోని, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నాదర్ గుల్, ద్వారక పురి కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన రామినేని శ్రీనివాసరావు మృతదేహానికి.. నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహ రెడ్డి తదితరులు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు..