Monday, February 9, 2026
Google search engine
Homeస్పోర్ట్స్ఆస్ట్రేలియాతో ఐదో టీ20 వర్షార్పణం..

ఆస్ట్రేలియాతో ఐదో టీ20 వర్షార్పణం..

2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా..
అదరగొట్టిన భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నేడు కీలకమైన ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో వర్షం, పిడుగుల కారణంగా ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. కేవలం 4.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 52 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు (ఒక ఫోర్, ఒక సిక్సర్), శుభ్‌మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులు (6 ఫోర్లు) చేసి అజేయంగా నిలిచారు. భారత్ భారీ స్కోరు చేసేలా కనిపించిన దశలో వర్షం మొదలైంది.

వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు కూడా రావడంతో ఆటను నిలిపివేశారు. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో, మైదానం ఆటకి అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షార్పణం అయింది. రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలవగా, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో భారత్ అద్భుత విజయాలు సాధించి 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఇప్పుడు చివరి మ్యాచ్ కూడా రద్దు కావడంతో అభిమానులు నిరాశ చెందారు.

ఈ సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌లలో తమ ఘనమైన రికార్డును భారత్ కొనసాగించింది. గత 17 ఏళ్లుగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఒక్క టీ20 సిరీస్ ను కూడా కోల్పోలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments