బ్రిస్బేన్ కమిటీతో భేటీ అయిన ఐసీసీ చైర్మెన్ జే షా..
ఒలింపిక్స్ క్రీడల్లో మళ్లీ క్రికెట్కు చోటు ఇవ్వనున్నారు. 128 ఏళ్ల తర్వాత జెంటిల్మెన్ ఆట మళ్లీ ఒలింపిక్స్లో కనిపించనున్నది. 2028లో జరిగే లాస్ ఏంజిల్స్ క్రీడల్లో క్రికెట్ ఆడనున్నారు. అయితే 2032లో బ్రిస్బేన్లో జరిగే ఒలింపిక్స్లో.. క్రికెట్కు అవకాశం కల్పించే అంశంపై ఇవాళ చర్చ జరిగింది. కొత్తగా నియమితుడైన ఐసీసీ చైర్మెన్ జే షా ఆ మీటింగ్లో పాల్గొన్నారు. బ్రిస్బేన్ ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు.