ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆదేశానుసారం కార్యక్రమం..
కార్యక్రమంలో పాల్గొన్న మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి..

ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆదేశాల అనుసారంగా గురువారం రోజు తొర్రూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బి బ్లాక్ ముఖ్య నాయకుల ముఖ్య కార్యకర్తల మీటింగ్.. ఆదేవుడగంగా బి బ్లాక్ లో తుర్కయంజాల్ మున్సిపాలిటీ, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ, అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ కమిటీల మీటింగ్ జరిగింది..
రాష్ట్ర యువ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు, పనిచేసే వారికి పార్టీ పదవులు వస్తాయని తెలియజేశారు.. అదే విధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అధిక నిధులు తెచ్చి అభివృద్ధితో పాటు అన్ని పథకాలు ఇస్తున్నామని గ్రామాలలో పర్యటించి ప్రజలకు తెలపాలి అని నాయకులకు సూచించారు..
ఈ కార్యక్రమంలో. మున్సిపాలిటీల, మండల అధ్యక్షులు.. మాజీ ఎంపీపీలు.. మాజీ జడ్పీటీసీలు.. మాజీ చైర్మన్లు.. మాజీ సర్పంచులు.. మాజీ ఎంపీటీసీలు.. మాజీ కౌన్సిలర్లు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారని బి బ్లాక్ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, సిహెచ్ భాస్కర్ చారి ఒక ప్రకటనలో తెలియజేశారు..


