రూ. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా దాడి చేసిన అధికారులు..
అప్పటికే ఆ అధికారి రూ. 4 లక్షలు తీసుకున్నట్లు తెలిపిన బాధితుడు..
ఊచలు లెక్కిస్తున్న సికింద్రాబాద్ జోన్ ఏసీపీ బీ. విఠల్ రావు..
కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు..
జీ.హెచ్.ఎం.సి. సికింద్రాబాద్ జోన్, జోనల్ ఆఫీస్ లో బీ. విఠల్ రావు అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.. కాగా ఒక అపార్ట్మెంట్ యజమానినుంచి అతనికి సంబంధించిన రెండు ఆక్యుపెన్సీ సరిఫికేట్స్ ప్రాసెస్ చేయడానికి సదరు విఠల్ రావు రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు.. అపార్ట్మెంట్ యజమాని ముందుగా అతనికి రూ. 4 లక్షలు ఇచ్చాడు.. మిగిలిన రూ. 4 లక్షలు కోసం ఏసీపీ వత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.. ఈ క్రమంలో రూ. 4 లక్షలు బాధితుడి నుంచి విఠల్ రావు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.. అతని వద్ద నుంచి రూ. 4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.. విఠల్ రావును ను తదుపరి విచారణ నిమిత్తం నాంపల్లిలోని ఎస్.పీ.ఎఫ్. ఏసీబీ కేసుల ప్రధాన న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు..
కాగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగిన సందర్భంలో టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు.. అలాగే ఏసీబీ, తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు, 9440446106 అనే వాట్స్ ఆప్ నెంబర్, తెలంగాణ ఏసీబీ పేస్ బుక్, అదేవిధంగా ట్విట్టర్ @ తెలంగాణ ఏసీబీ ద్వారా కూడా సంప్రదించవచ్చని ఏసీబీ అధికారులు తెలియజేశారు.. ఈ క్రమంలో ఫిర్యాదు దారుడి పేరు, వివరాలు గోప్యంగా వుంచబడతాయని వారు తెలియజేశారు..