ప్లాస్టిక్ బాటిళ్లతో బాస్ షెల్డర్ నిర్మాణం..
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో విన్నూత్న ఆలోచన..
బస్ షెల్టర్ అనగానే ఇనుము, స్టీల్, సిమెంట్తో నిర్మించినవి చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం వినూత్న రీతిలో ప్లాస్టిక్ బాటిళ్లతో బస్ షెల్టర్ను నిర్మించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామంలో ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించినటువంటి ఈ బస్ షెల్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. పరకాల-హుజురాబాద్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ గ్రామంలో అప్పటి ఎంపీడీవో పల్లవి తన ఆలోచన ప్రయోగానికి ఈ ఊరు వేదికగా మారింది. ఈ ప్రత్యేకమైన చొరవ బస్ స్టాప్ అవసరాన్ని పరిష్కరించడమే కాకుండా రీసైకిలింగ్, పర్యావరణ స్పృహను కూడా ప్రోత్సహిస్తుంది.

ఉప్పులపల్లి గ్రామం 2018లో గ్రామపంచాయతీగా మారింది. పల్లె ప్రకృతి చొరవతో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ ప్రతి ఇంటి నుండి చెత్తను క్రమం తప్పకుండా సేకరిస్తారు.సేకరించిన వ్యర్థాలను డంప్ యార్డుకు రవాణా చేస్తారు.అక్కడ సిబ్బంది ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర పదార్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ సీసాల సంఖ్య పెరుగుతుండడంతో ఓ సమస్యగా మారిపోయాయి. ఇదే అంశాన్ని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఎంపీడీఓ పల్లవికి చేరవేయడంతో ప్లాస్టిక్ బాటిళ్లతో బస్సు షెల్టర్ నిర్మించాలని ఎంపీడీవో వారికి సూచించారు.
