పదో తరగతిలో 63. 97, ఇంటర్ లో 63. 41 శాతం పాస్..
ఈనెల 12 నుంచి 18 వరకు రీ వెరిఫికేషన్ ఫీజ్ చెల్లించవచ్చు..
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏప్రిల్ 20 నుంచి మే 26వరకు ఈ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను www. telangana open school.org. వెబ్సైట్లో ఉంచారు. మహిళలు పదో తరగతిలో 63.97 శాతం, ఇంటర్లో 63.41 శాతం పాస్ అయ్యారు.
పురుషులు పదోతరగతిలో 53.24 శాతం, ఇంటర్లో 57.49 శాతం, ఉత్తీర్ణులయ్యా రు. పదో తరగతిలో 28,547 మంది పరీక్షలు రాయగా, 16,443 57.60శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్లో 41,051 మంది పరీక్షలు రాస్తే, 24,538 (59.77 శాతం) పాసయ్యారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 12 నుంచి 18 వరకు ఫీజు చెల్లించవచ్చునని అధికారులు తెలిపారు.