తాను స్వయంగా భరిస్తానని మాట ఇచ్చిన ఎన్ .ఆర్.ఐ. కంభం శ్రీనివాస్ రెడ్డి..
బాలుడి తల్లిదండ్రులతో అమెరికా నుండి ఫోన్ లో మాట్లాడి భరోసా..

- ఎన్.ఆర్.ఐ. కంభం శ్రీనివాస్ రెడ్డి..
గత సంవత్సరం నుండి తల సేమియా వ్యాధితో బాధపడుతున్న, నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన, బల్లెం అబ్బయ్య, స్వరూప దంపతుల పెద్ద కుమారుడు బల్లెం ప్రణయ్ కు ఆపరేషన్ నిమిత్తం 20 లక్షలు ప్రభుత్వ పరంగా సహకారం చేస్తున్నప్పటికీ, ఇతర వైద్య ఖర్చుల నిమిత్తము డబ్బులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న వారిని ఇందుర్తి మేటి చందాపురం గ్రామానికి చెందిన కుంభం శ్రీనివాస్ రెడ్డి, ప్రవాస భారతీయుడు.. పెద్ద మనసుతో ప్రణయ్ ఆపరేషన్ కు సంబంధించిన ఇతర ఖర్చులను భరిస్తానని చెప్పి స్వయంగా బాధితుని తల్లిదండ్రులతో అమెరికా నుండి ఫోన్ లో మాట్లాడి వారికి భరోసా ఇచ్చినట్లుగా ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య తెలియజేయడం జరిగింది.

- ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య