జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదు..
బీ. ఎన్. రెడ్డి డివిజన్ పరిధిలోని పలు కాలనీల ప్రజల విన్నపం..
జలమండలి ఎండీ ప్రధాన కార్యాలయంలో నిరసన కార్యక్రమం..
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో పలు కాలనీలలో ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి డ్రైనేజీ లైన్లు పాడైపోయిన జలమండలి అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కావున వెంటనే డ్రైనేజ్ మరమ్మత్తుల చర్యలు చేపట్టాలని మరియు డివిజన్ పరిధిలోని . బృందావన్ మెడోస్ .. బృందావన్ మెడోస్ ఫేస్ 1 .. శ్రీ శ్రీనివాస కాలనీ .. సౌభాగ్య కాలనీ .. జక్కిడి కాలనీ .. మహాలక్ష్మి నగర్ .. పాపిరెడ్డి కాలనీ .. భవాని ఎన్ క్లేవ్.. జక్కిడి రామస్వామి కాలనీ.. గాయత్రి నగర్.. శ్రీ గాయత్రి నగర్ .. విజయ్ శ్రీ కాలనీలలో తక్షణమే నూతన డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మించాలని శనివారం రోజు జిహెచ్ఎంసి జలమండలి ఎండీ ప్రధాన కార్యాలయంలో నిరసన తెలియజేసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ వారితో పాటు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.