భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌటైంది. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కూడా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (6/48) దెబ్బకు భారత టాప్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. అతడితోపాటు కమిన్స్ 2, స్కాట్ బోలాండ్ 2 వికెట్లు తీశారు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 37, శుభ్మన్ గిల్ 31, అశ్విన్ 22, రిషభ్ పంత్ 21 పరుగులు చేశారు. యశస్వి, హర్షిత్, బుమ్రా డకౌట్ కాగా.. విరాట్ కోహ్లీ 7, రోహిత్ 3 విఫలమయ్యారు. సిరాజ్ 4 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
పింక్ బాల్ టెస్టులో మరోసారి ఆదుకున్న నితీశ్.. భారత్ 180 పరుగులకు ఆలౌట్
RELATED ARTICLES