ఇండియన్ విస్కీ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఒకప్పుడు సుగంధ ద్రవ్యాలు, టీలకు మాత్రమే పేరుగాంచిన భారతదేశం నేడు ప్రపంచ విస్కీ మార్కెట్ను శాసిస్తోంది. టాప్ 10లో భారతీయ బ్రాండ్లు 5 స్థానాలు దక్కించుకోగా, ఒక్క చైనా బ్రాండ్ కూడా ఈ జాబితాలో లేదు. ఇది కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు, మన దేశానికి పెరుగుతున్న ఖ్యాతి, అద్భుతమైన నాణ్యతకు గుర్తింపు. ప్రతి గుటకలో భారతీయ విస్కీ ఇప్పుడు ప్రపంచంపై తనదైన ముద్ర వేస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత బంగారు మయం కానుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
భారతీయ విస్కీ ప్రపంచవ్యాప్తంగా తన బలాన్ని నిరూపించుకుంది. ఒకప్పుడు భారతదేశం సుగంధ ద్రవ్యాలు, టీలకు ప్రసిద్ధి చెందింది, కానీ ఇప్పుడు భారతీయ విస్కీ ప్రపంచ మార్కెట్ను శాసిస్తోంది. ‘ది స్పిరిట్స్ బిజినెస్ బ్రాండ్ ఛాంపియన్స్ 2024’ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన విస్కీ భారతీయ బ్రాండ్. ఇది మాత్రమే కాదు, 5 భారతీయ బ్రాండ్లు టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి. అయితే ఈ జాబితాలో ఏ చైనీస్ బ్రాండ్ కూడా నిలువ లేదు. ఇది భారతదేశంలో పెరుగుతున్న విస్కీ మార్కెట్, అద్భుతమైన నాణ్యతకు నిదర్శనం.
నివేదిక ప్రకారం, 2023లో అత్యధికంగా అమ్ముడైన విస్కీలో భారతీయ బ్రాండ్లు టాప్ 4 స్థానాలను ఆక్రమించాయి. మెక్డోవెల్స్ 31.4 మిలియన్ కేసులు అమ్ముడయ్యాయి. రాయల్ స్టాగ్ 27.9 మిలియన్ కేసులతో రెండవ స్థానంలో నిలిచింది. ఆఫీసర్స్ ఛాయిస్ (23.4 మిలియన్ కేసులు), ఇంపీరియల్ బ్లూ (22.8 మిలియన్ కేసులు) కూడా టాప్ 4 లో నిలిచాయి. 5వ స్థానంలో స్కాట్లాండ్కు చెందిన జానీ వాకర్ ఉంది. ఇది 22.1 మిలియన్ కేసులను విక్రయించింది. టాప్ 10లో భారతదేశానికి చెందిన 8 PM విస్కీ కూడా ఉంది. ఇది 12.2 మిలియన్ కేసులు అమ్ముడైంది. బ్లెండర్స్ ప్రైడ్ (9.6 మిలియన్ కేసులు), రాయల్ ఛాలెంజ్ (8.6 మిలియన్ కేసులు), స్టెర్లింగ్ రిజర్వ్ (5.1 మిలియన్ కేసులు) వంటి ఇతర భారతీయ బ్రాండ్లు కూడా టాప్ 20లో చోటు దక్కించుకోగలిగాయి.