Tuesday, June 24, 2025
Google search engine
Homeతెలంగాణబృందావన్ కాలనీ నూతన కార్యవర్గం ఏర్పాటు..

బృందావన్ కాలనీ నూతన కార్యవర్గం ఏర్పాటు..

అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం..
కాలనీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె. పృథ్వి రాథోడ్..

బడంగ్ పేట్ కార్పొరేషన్, 26వ డివిజన్ పరిధిలోని, బృందావన్ కాలనీ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకొని.. ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. కాలనీ అధ్యక్షునిగా కె. పృధ్వి రాథోడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంక్షేమంలో పృధ్వి రాథోడ్ పాత్ర ఒక మెట్టు ఎక్కువ అని చెప్పాలి. ఆడంబరం లేని నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యశాలి, కాలనీవాసులందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నటువంటి ఆదర్శ ప్రాయుడు, అనునిత్యం కాలనీ వాసులతో మమేకమై నిత్యం కాలనీ అభివృద్ధికై ఆలోచించే విద్యావంతుడైన కే. పృథ్వీ రాథోడ్ ను ఏకగ్రీవంగా కాలనీ అధ్యక్షునిగా ఎన్నుకున్నామని కాలనీ వాసులు తెలిపారు. ఈ సందర్భంగా కే. పృథ్వీ రాథోడ్ మాట్లాడుతూ.. తనమీద నమ్మకంతో కాలనీ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన బృందావన్ కాలనీ ప్రజలకు, కార్యవర్గ సభ్యులకు ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు. కాలనీ అసోసియేషన్ సభ్యుల సహకారంతో కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన పాలకవర్గ సభ్యులతో కలిసి మాజీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ రామిడీ కవిత రామిరెడ్డి, మహేశ్వరం నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డిలను కలిసి కాలనీ అభివృద్ధి సంక్షేమానికి సహకరించాలని కోరడం జరిగిందన్నారు. నూతనంగా ఎన్నికైన కాలనీ అధ్యక్షుడు పృథ్వి రాథోడ్, కార్యవర్గానికి నాయకులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు ఎలాంటి విభేదాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ కాలనీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కాలనీ అధ్యక్షుడు పృథ్వి రాథోడ్ కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరి రమేష్ గౌడ్, ట్రెజరర్ రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బాలరాజ్ చారి, జాయింట్ సెక్రెటరీ రాము నాయక్, ఆర్గనైజర్ సెక్రటరీ సందీప్, మల్లేష్, కార్యవర్గ సభ్యులు, కాలనీ ప్రజానీకం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments