Monday, June 23, 2025
Google search engine
Homeసినిమావిక్టరీ వెంకటేశ్‌ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'ఫస్ట్ సింగిల్‌ విడుద‌ల

విక్టరీ వెంకటేశ్‌ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ఫస్ట్ సింగిల్‌ విడుద‌ల

విక్టరీ వెంకటేశ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుక‌గా 2025 జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘గోదారి గట్టు మీద రామ చిలకవే’ అంటూ సాగే ఈ పాటను ఒక‌ప్ప‌టి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, సింగర్ రమణ గోగుల ఆల‌పించారు.

ప్ర‌ముఖ రచ‌యిత భాస్క‌ర‌భ‌ట్ల ఈ సాంగ్ కి లిరిక్స్ రాసారు. ముఖ్యంగా రమణ గోగుల హ‌స్కీ వాయిస్‌ ఈ పాటకు యాడ్ అవ్వడం మరింత ప్లస్ అయింది. తెలంగాణ ఫోక్ సింగ‌ర్ మ‌ధుప్రియ రమణ గోగులతో కలిసి ఈ పాట పాడ‌టం విశేషం. ఇక ఈ సాంగ్‌లో వెంకీ, ఐశ్వర్య రాజేశ్ త‌మ‌దైన డ్యాన్స్ స్టెప్పులు వేయ‌డం అభిమానులను ఆకట్టుకుంది.

అయితే ఈ పాట ఈ మూవీలోనే త‌న ఫేవ‌రెట్ అని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. క‌చ్చితంగా ఈ సాంగ్ మీచేత థియేట‌ర్ల‌లో డ్యాన్స్ చేయిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నార‌ని తెలుస్తోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments