ఎల్ఐసీ గోల్డన్జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024
టెన్త్, ఇంటర్, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు
డిసెంబర్ 22 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయం
చదువుకోవాలనే ఆసక్తి ఉండి ఆర్థిక పరిస్థితులు సహకరించని విద్యార్థులను ప్రోత్సహించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ స్కీమ్ను తీసుకు వచ్చింది. గోల్డన్జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 పేరిట ఈ స్కాలర్షిప్ తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకం అందించనుంది. తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో అర్హులు, దరఖాస్తు తేదీ తదితర వివరాలను అందులో పొందుపరిచింది.
2021-22, 2022-23, 2023 -24 అకడమిక్ ఇయర్లో 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ డిప్లొమా లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్న వాళ్లు ఈస్కాలర్ షిష్నకు అప్లయ్ చేసుకోవచ్చు. వీళ్లు గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థులు పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి https://www.licindia.in/ వెబ్సైట్ చూడొచ్చు. విద్యార్థులు డిసెంబర్ 8 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 22 దరఖాస్తులకు చివరితేది.