నీలోఫర్ ఆసుపత్రి దగ్గర 400 మందికి అన్నదాన కార్యక్రమం..
కార్యక్రమంలో పాల్గొన్న తమిళ హీరో సూర్య ఫ్యాన్స్ క్లబ్, తెలంగాణ ప్రెసిడెంట్ సందీప్ కిషోర్..
అన్నిదానాల్లోకి అన్నదానం మహా గొప్పది అంటారు.. పదిమంది ఆకలి తీర్చడం మహోన్నతమైన కార్యక్రమం.. ఈ కోవలోనే
రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీలోఫర్ హాస్పిటల్ దగ్గర 400 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా తమిళ స్టార్ హీరో సూర్య ఫాన్స్ క్లబ్, తెలంగాణ ప్రెసిడెంట్ సందీప్ కిషోర్ పాల్గొని తన వంతు సహకారం అందించారు.. హీరో సూర్య ఎంతోమందికి అన్నదానం, విద్యాదానం చేస్తూ గొప్పగా నిలిచారు.. అలాగే అభిమానులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన పేరు నిలబెట్టాలని, సినీ నటుడు బతుకమ్మ హీరో విజయభాస్కర్ పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో బతుకమ్మ హీరో విజయభాస్కర్, సూర్య ఫ్యాన్స్ క్లబ్ తెలంగాణ ప్రెసిడెంట్ సందీప్ కిషోర్, పిఎస్ క్రియేషన్ అధినేత శేఖర్, లక్ష్మణ్, శివ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు..