హయత్ నగర్ సర్కిల్ పరిధిలో వివిధ వార్డుల్లో పర్యటన..
జెడ్.సి.తో పాటు పాల్గొన్న ఇతర జీ.హెచ్.ఎం.సి. సిబ్బంది..
గురువారం రోజు ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ హేమంత కేశవ పాటిల్, ఐఏఎస్ హయత్ నగర్ సర్కిల్ పరిధిలో వివిధ వార్డులలో పర్యటించారు.. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు..
ఈ పర్యటనలో భాగంగా నాగోల్ డివిజన్ లోని హనుమాన్ నగర్ వద్ద సిసి రోడ్.. మన్సూరాబాద్ డివిజన్ లోని వివేకానంద నగర్ కాలనీ వద్ద సిసి రోడ్.. హయత్ నగర్ డివిజన్ లోని వరదయ్య నగర్, సిటీ మోడల్ స్కూల్ వద్ద సిసి రోడ్డు.. మహా గాయత్రి నగర్ కాలనీ వద్ద సిసి రోడ్ లను పరిశీలించి జరుగుతున్న పనులు నాణ్యత లోపాలు లేకుండా నిర్వహించాలని, మంజూరైన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ తిప్పర్తి యాదయ్య, బి. కనకయ్య, పి. దామోదర్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు యం. నీలిమ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లక్ష్మీ దీపక్, స్వప్న, హేము నాయక్, రాజ్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు, పి. మేధా, హార్టికల్చర్ మేనేజర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.