ఐ.ఆర్.సి.టి.సి. నుంచి సరికొత్త ప్ల్యాకేజీ ప్లాన్..
4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగే యాత్ర..
ఈ నెల 19 నుంచి అందుబాటులో టికెట్లు..
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం దర్శించుకోవాలని చూస్తున్న భక్తుల కోసం ఇండియన్ రైల్వే శాఖ స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో ఐఆర్ సీటీసీ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ లో కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి దర్శనంతో పాటు పుదుచ్చేరిలోని పకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. ప్రతీ గురువారం కాచిగూడ స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుందని, 4 రాత్రులు, 5 పగళ్లు యాత్ర కొనసాగుతుందని వెల్లడించింది. జూన్ 19 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

సాయంత్రం 5 గంటలకు యాత్ర షురూ..
గురువారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.
రెండో రోజు.. ఉదయం 11 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటారు. హోటల్లో విశ్రాంతి తీసుకొని అరోవిల్, అరబిందో ఆశ్రమం, బీచ్ సందర్శన. రాత్రి పుదుచ్చేరిలోనే బస.
మూడో రోజు.. ఉదయం టిఫెన్ చేసి తిరువణ్ణామలై చేరుకుంటారు. హోటల్ లో స్వల్ప విశ్రాంతి తర్వాత అరుణాచలేశ్వరుడి దర్శనం.. రాత్రి అక్కడే బస
నాలుగో రోజు.. ఉదయం టిఫిన్ చేసి కాంచీపురానికి బయల్దేరుతారు. కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయ సందర్శన. ఆ తర్వాత చెంగల్పట్టు స్టేషన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3:35 గంటలకు తిరుగు ప్రయాణం.
ఐదో రోజు.. ఉదయం 7:50 గంటలకు కాచిగూడ చేరుకుంటారు.
ఛార్జీలు (ఒక్కరికి) థర్డ్ ఏసీలో..
ట్విన్ షేరింగ్ కు రూ.20,060, ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,610
పిల్లలకు (5 నుంచి 11 ఏళ్లలోపు) విత్ బెడ్ రూ.11,750, వితౌట్ బెడ్ రూ.9,950
స్లీపర్ క్లాస్ లో..
ట్విన్ షేరింగ్కు రూ.17,910, ట్రిపుల్ షేరింగ్కు రూ.13,460.
పిల్లలకు (5 నుంచి 11 ఏళ్లలోపు) విత్ బెడ్తో రూ.9,590, అదే వితౌట్ బెడ్ రూ.7,800
(గమనిక: బృందంగా వెళ్లే వారు గ్రూప్ బుకింగ్ చేసుకుంటే ఐఆర్ సీటీసీ రాయితీ ఇస్తోంది)
ప్యాకేజీలో లభించే సదుపాయాలు..
ప్యాకేజీని బట్టి రైల్లో 3 ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం, స్థానికంగా ప్రయాణానికి వాహనం ఏర్పాటు
రెండు రోజుల బస, ఉదయం టిఫిన్ బాధ్యత ఐఆర్సీటీసీదే. ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం
ఐఆర్సీటీసీ పాలసీ ప్రకారం.. క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి.

మరింత సమాచారం, బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ను సందర్శించండి.