పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి..
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, నాయకులు..
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్, అల్మాస్ గూడా గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం పనులను టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ జ్యోతి రెడ్డి, ఏఈఈ వినీల్ గౌడ్, కార్పొరేటర్ జెనిగే పద్మ ఐలయ్య, నాయకులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, నవారు మల్లారెడ్డి, ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, రామిడి విరకర్ణా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.