బడంగ్ పేట్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ హోమ్స్ లో కార్యక్రమం ఏర్పాటు..
చిగిరింత దంపతులను ఆత్మీయంగా సన్మానించుకున్న కాలనీవాసులు..
మహేశ్వరం నియోజక వర్గ పరిధిలోని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్, 31వ డివిజన్, శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేస్ 2 కాలనీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహ రెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా చిగిరింత దంపతులను కాలని వాసులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మాట్లాడుతూ.. కాలనిలో సమస్యలు అన్ని పరిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పోటీ చేసిన సమయంలో ఈ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం చూసి ప్రచార సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం అని గుర్తుచేసుకున్నారు.. మీ అందరి సహకారంతో కార్పొరేటర్ గా గెలవడం.. మేయర్ కావడంతో రోడ్లు, డ్రినేజీలు పూర్తి చేయగలిగానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలని కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.