Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణఆత్మీయ సన్మానం అందుకున్న చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు..

ఆత్మీయ సన్మానం అందుకున్న చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు..

బడంగ్ పేట్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ హోమ్స్ లో కార్యక్రమం ఏర్పాటు..
చిగిరింత దంపతులను ఆత్మీయంగా సన్మానించుకున్న కాలనీవాసులు..

మహేశ్వరం నియోజక వర్గ పరిధిలోని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్, 31వ డివిజన్, శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేస్ 2 కాలనీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహ రెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా చిగిరింత దంపతులను కాలని వాసులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మాట్లాడుతూ.. కాలనిలో సమస్యలు అన్ని పరిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పోటీ చేసిన సమయంలో ఈ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం చూసి ప్రచార సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం అని గుర్తుచేసుకున్నారు.. మీ అందరి సహకారంతో కార్పొరేటర్ గా గెలవడం.. మేయర్ కావడంతో రోడ్లు, డ్రినేజీలు పూర్తి చేయగలిగానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలని కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments