Wednesday, February 11, 2026
Google search engine
Homeస్పోర్ట్స్ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం లండన్‌కు చేరిన భారత జట్టు

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం లండన్‌కు చేరిన భారత జట్టు

హీత్రూ విమానాశ్రయంలో ఆటగాళ్లకు ఘన స్వాగతం..
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఎల్లుండి నుంచి మ్యాచ్ ప్రారంభం..
ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న ఐదు టెస్టుల సిరీస్..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కీలకమైన మూడో పోరుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు లండన్ నగరానికి చేరుకుంది. మంగళవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు అక్కడి అభిమానులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు బస చేసేందుకు ఏర్పాటు చేసిన హోటల్‌కు నేరుగా వెళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో మూడో టెస్టు ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. క్రికెట్ కాశీగా పేరుగాంచిన ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఎల్లుండి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భారత్, ఇంగ్లండ్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments