కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి..
47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ పెరెరాగా గుర్తింపు
భారత్కు చెందిన వ్యక్తి జోర్డాన్ సరిహద్దు నుంచి ఇజ్రాయెల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. గమనించిన జోర్డాన్ సైనికులు అతడ్ని కాల్చి చంపారు. మృతుడ్ని కేరళలోని తుంబాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ పెరెరాగా గుర్తించారు. అతడి బంధువు ఎడిసన్ కాల్పుల్లో గాయపడినప్పటికీ ప్రాణాలు దక్కించుకున్నాడు. చికిత్స తర్వాత అతడ్ని భారత్కు పంపారు. ఫిబ్రవరి 10న ఈ సంఘటన జరిగినట్లు జోర్డాన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ‘దురదృష్టవశాత్తూ భారత జాతీయుడు మరణించిన విషయం తెలిసింది. మృతుడి కుటుంబంతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు జోర్డాన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నాం’ అని ఎక్స్ పోస్ట్లో పేర్కొంది.