Friday, June 20, 2025
Google search engine
Homeఇంటర్నేషనల్ఇజ్రాయెల్ దాడి చేసి పెద్ద తప్పు చేసింది..

ఇజ్రాయెల్ దాడి చేసి పెద్ద తప్పు చేసింది..

ఇజ్రాయెల్‌కు శిక్ష తప్పదని అయతొల్లా అలీ ఖమేనీ స్పష్టం..
ట్రంప్ తరహా బెదిరింపులకు ఇరాన్ లొంగిపోదని వెల్లడి..

తమ దేశంపై దాడి చేసి ఇజ్రాయెల్ పెను తప్పిదానికి ఒడిగట్టిందని, అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని ఆయన స్పష్టం చేశారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను గుర్తు చేస్తూ, ఇటువంటి బెదిరింపులకు ఇరాన్ లొంగేది లేదని ఖమేనీ తేల్చి చెప్పారు. ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి ఈ విషయం సుస్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఒకవేళ అమెరికా సైన్యం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే, అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇరాన్ ఎన్నటికీ తలవంచదని ఆయన పునరుద్ఘాటించారు.

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా జోక్యం చేసుకుంటే, అది పశ్చిమాసియా ప్రాంతంలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి హెచ్చరించారు. ప్రస్తుత ఘర్షణలపై తొలిసారిగా స్పందించిన ఆయన, తమ దేశంపై జరిగిన దాడులకు ధీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసని, ఆయన సురక్షితంగానే ఉన్నారని, అయితే ప్రస్తుతానికి ఆయన్ను అంతమొందించాలనే ఉద్దేశం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments