అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ ను కలిసి విజ్ఞప్తి చేసిన బీ.ఎం.ఈ.యు. నాయకులు, ఇతర కార్మిక నాయకులు..
బుధవారం రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ నందు అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ కలిసి తమ సమస్యలను విన్నవించారు బీ.ఎం.ఈ.యు. నాయకులు.. ఈ ఈ.వీ.డీ.ఎం. నుంచి వచ్చిన ఔట్సోర్సింగ్ కార్మికులను ఏదైతే ట్రాన్స్ పోర్ట్ నుండి తీసుకున్నారో.. తిరిగి అదే ట్రాన్స్ పోర్ట్ కి తీసుకోవాల్సిందిగా వారు కోరారు.. దీనికి అడిషనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి, జీ.హెచ్.ఎం.సి. కమీషనర్ దృష్టికి తీసుకుని వెళ్లి తమకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారని వారు తెలియజేశారు.. ఈ కార్యక్రమం లో జీ.హెచ్.ఎం.సి. కన్వీనర్ అకుల శ్రీనివాస్, కార్మికుల నాయకులు సముద్రాల శ్రీనివాస్, ఎండీ జహీర్, గడ్డం జగదీష్, కె బాలరాజు, బీ.ఎం.ఈ.యూ. నాయకులు భూపతి, మురళీ, సంజీవ, ఇతర కార్మిక నాయకులు, కార్మికులు, మహిళలు పాల్గొన్నారు..