ఒక ప్రకటనలో తెలిపిన ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్..
పూర్తి వివరాలు ఓయూ వెబ్ సైట్ లో చూసుకోవాలని సూచన..
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాథమేటిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్, పీజీడీబీఎం, వేదిక్ ఆస్ట్రాలజీ తదితర విభాగాలలో అడ్వాన్స్డ్ పీజీ డిప్లమా కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలను వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎంటెక్ కోర్సుల మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని, ఫలితాలను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
మార్కుల మెమోలను సంబంధిత కళాశాల నుంచి రెండు వారాల తర్వాత పొందవచ్చని పేర్కొన్నారు. ఈ ఫలితాల రివాల్యుయేషన్కు ఒక్కో పేపర్ కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 18వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో 19వ తేదీ వరకు టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జవాబు పత్రాల నకలు కావాల్సిన వారు ఒక్కో పేపర్ కు రూ. 1000 చొప్పున చెల్లించి ఈ నెల 19వ తేదీ వరకు తమ కార్యాలయంలో చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.