కాలనీలో సమస్యలు పరిష్కరించాలని వినతి..
సానుకూలంగా స్పందించిన ఈటల..
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని, విజయపురి కాలనీ ఫేస్ 1 సంక్షేమ సంఘం సభ్యులు, హరిహరపురం కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం సభ్యులు బుధవారం రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని వారి నివాసంలో కలసి, కాలనీలో సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. త్వరలోనే డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో అభివృద్ధి, సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, విజయపురి కాలనీ ఫేస్ 1 అధ్యక్షులు వెంకట్ రెడ్డి, హరిహర పురం కాలనీ అధ్యక్షులు శంకరయ్య గౌడ్, కాలనీ ప్రధాన కార్యదర్శి, బిజెపి పార్టీ డివిజన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, హరిహర పురం కాలనీ ప్రధాన కార్యదర్శి సందీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, జాయింట్ సెక్రెటరీ నరేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పృద్వి, కార్యవర్గ సభ్యులు సత్తయ్య, సాయి గోపాల్, వేణుగోపాల్ రెడ్డి, వెంకటరమణ, సుదర్శన్, శ్రీనివాసరావు, శ్రీకాంత్, సతీష్, పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, పవన్ రెడ్డి, కిషోర్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.