వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి..
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గల బడంగ్ పేట్ లోని వెంకటాద్రి నివాస్ కాలనీలో అనంతరం బడంగ్ పేట్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం అయ్యిందని అన్నారు. ఆనాడు యువకుల బలిదానాలు చూడలేక ఒక రాష్ట్రంలో పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటి డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, దయాసాగర్ రెడ్డి, సుభాన్ యాదవ్, బలింగని జంగయ్య, రవికాంత్ రెడ్డి, పుట్టగల్ల జగన్, బంగారి అశోక్, నవారు మల్లారెడ్డి, అమృత నాయుడు, బొల్లాపల్లి కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్ణగంటి విజయ్, పెద్దబావి బాబు, బద్దం రాము గౌడ్, చంద్ర పాల్ రెడ్డి, మనోహర్, గిరి ముదిరాజ్, జెల్ల రమేశ్ గౌడ్, మురళి మోహన్, నరహరి గౌడ్, టేకుల సుధాకర్ రెడ్డి, ఐలమని, భాను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.