40 ఏళ్ళ పైబడినవారు ఖచ్చితంగా పాటించాలి..
వయస్సు మీడ పడే కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. ప్రధానంగా క్యాల్షియాన్ని శరీరం శోషించుకోలేదు. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారిపోతాయి. ఫలితంగా ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తుంటాయి. అందువల్ల వయస్సు మీద పడుతున్న వారు ఎముకల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శరీరంలో క్యాల్షియం స్థాయిలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. మన శరీరంలో క్యాల్షియం అనేది చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది.
పాలు, బాదంపాలు, పెరుగు, పాలకూర ఖచ్చితంగా తీసుకోవాలి అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..