ఎల్బీనగర్:
గడ్డిఅన్నారం డివిజన్ లో సీఎంఆర్ కాంప్లెక్స్ వద్ద భారాస రాష్ట్ర యువజన నాయకుడు గండి జ్యోతి ప్రసాద్ యాదవ్ (సన్నీ యాదవ్ )ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన భరత మాత వీర పుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 369 వ జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం సుమారుగా 2 వేల మంది పేదవారికి అన్నదానం గావించారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం భారాస నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర రావు, గండి కృష్ణ యాదవ్, భవాని ప్రవీణ్ కుమార్, శ్రీశైలం యాదవ్,ఐలేష్ యాదవ్, బైర శంకర్, కిరణ్ కుమార్, సమ్ము రాములు, శివరాం తదితరులు పాల్గొన్నారు.


