బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు..
గోమాతలను కాపాడిన గోరక్షక్ రాజీవ్ జీ పై రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, శంషాబాద్ పోలీస్ స్టేషన్ యందు కేసు నమోదైన విషయం తెలిసిందే.. పోలీసులు ఆయనపై యూ./ఎస్. 109 బీ.ఎన్.ఎస్. ( గతంలోని 307 ఐపీసీ ) సెక్షన్లు నమోదు చేశారు.. ఈ అక్రమ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు రంగా రెడ్డి జిల్లా కోర్ట్, అతి తక్కువ వ్యవధి అంటే 10 రోజులకు బెయిల్ ఇవ్వడం జరిగింది.. ఈ క్రమంలో ఆయన జైలు నుండి విడుదల అయ్యారు.. ఈసందర్భంగా గోరక్షక్, న్యాయవాది అయిన గోరకంటి వినోద్ కుమార్ మాట్లాడుతూ గోరక్షకులకు న్యాయపరంగా అన్నివిధాలా సహకారం అందిస్తామని ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేశారు..