Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణచైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దౌర్జన్యకాండ..

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దౌర్జన్యకాండ..

హనుమయ్య అనే కాంట్రాక్టర్ పై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త, బీజేపీ నేత దీరజ్ రెడ్డి దాడి..
కాంట్రాక్ట్ పనుల విషయంలో రావాల్సిన బిల్లులు అడిగినందుకు విచక్షణ కోల్పోయిన వైనం..
ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బాధితుడు హనుమయ్య..
ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితుడిని పరామర్శించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్..
ఈ దుర్ఘటనను ఖండిస్తున్నామన్న ఆర్.ఎస్.పీ.
భూ కబ్జాలకు పాల్పడుతున్న దీరజ్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్స్.. .
సిసి కెమెరాలు ఆఫ్ చేసి దాడి చేశారని వెల్లువెత్తున్న ఆరోపణలు..
పోలీసులతో కుమ్మక్కై ఉల్టా కేసులు పెడుతున్నారు..
పోలీసులు బాధితులకు కాకుండా దాడి చేసిన వారికి సహకరిస్తున్నారని పలువురి ఆరోపణలు.. .

కాంట్రాక్ట్ పనులు చేసి రావలసిన బిల్లులు అడిగిన పాపానికి హనుమయ్య అనే కాంట్రాక్టర్ పై ఆర్.కె. పురం కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి అతని అనుచరులు విచక్షణా రహితంగా దాడిచేసి కొట్టారు.. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ హనుమయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. విషయం తెలుసుకున్న బీ.ఆర్.ఎస్. నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బాధితుడిని పరామర్శించారు.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.. బీజేపీ అగ్రనేత నడ్డా వచ్చి, సభ జరుగుతున్న కూత వేటు దూరంలో ఇలా బీజేపీ రౌడీలు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.. బీజేపీ నేతలు ఇలా దాడులు చేసి ప్రజలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.. తన కార్యాలయానికి వచ్చి తాను ఇవ్వాల్సిన బిల్లులు తీసుకెళ్లమని చెప్పి, విచక్షణ రహితంగా దాడి చేసిన దీరాజ్ రెడ్డిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు..

దాడి చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చి బజాప్త సీఐ ముందు కూర్చొని కేసులు ఎలా చేయాలో పోలీసులనే ఆదేశిస్తున్నారంటే ఏ స్థాయిలో పోలీస్ సిబ్బంది వ్యవహారం ఉందొ అర్ధం అవుతుంది అన్నారు.. దీరజ్ రెడ్డిని అరెస్టు చేయకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి పీఎస్ ముందు బైఠాయిస్తాం అని హెచ్చరించారు..

కాగా ఆర్కే పురం బిజెపి కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి దౌర్జన్యం పై బాధితుడు దాసరి హనుమయ్య కూతురు, పెద్దపల్లి బీ.ఆర్.ఎస్. కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయిన దాసరి ఉషా తీవ్రంగా స్పందించారు.. తన తండ్రిపై పథకం ప్రకారమే దాడి జరిగిందని ఆయన హత్యకు కుట్ర చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.. పట్టపగలే సీత రామ లిఫ్ట్ ఇరిగేషన్ 7 బ్లాక్ లో 2018 సంవత్సర కాలం నుండి కాంట్రాక్టర్ గా తన తండ్రి పని చేస్తున్నాడని.. దీనికి సంబంధించిన డబ్బులు రూ. 64 లక్షలకు గాను రూ. 30 లక్షలు ఇచ్చారని, మిగతా రూ. 34 లక్షలు ఇవ్వవలసి ఉండగా డబ్బులు ఇస్తానని చెప్పి నిన్న కొత్తపేట, ఆర్కే పురం లోని తన ఆఫీస్ కు పిలిపించుకొని తన అనుచరులతో కలిసి రక్తం కారేట్టుగా తన తండ్రిపై దాడిచేసి కొట్టారని ఆమె ఆరోపించారు.. కాగా రక్తంతో తడిసిన బట్టలతో చంపవద్దని కాళ్లపై పడి హనుమయ్య ప్రాధేయపడినా ధీరజ్ రెడ్డి కనికరించలేదు.. పైగా తన మనుషులను పంపి కొత్త బట్టలు తెచ్చి మార్చి, డబ్బులు అడిగితే చంపుతానని బెదిరించి వదిలేశారని దాసరి ఉషా తెలియజేసింది..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరి హనుమయ్య, ఆయన కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోతూ వేడుకున్నారు.. కాగా దాడిచేసిన ధీరజ్ రెడ్డిపై నామమాత్రపు కేసులు నమోదు చేశారని ఆరోపించారు దాసరి ఉష.. అయితే కేసునమోదు చేసుకొని చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

ఆర్.కె. పురం కార్పొరేటర్ భర్తను అదుపులోకి తీసుకున్న చైతన్యపురి పోలీసులు :

బీ.ఆర్.ఎస్. పార్టీ కి చెందిన సబ్ కాంట్రాక్టర్ హనుమయ్య కుటుంబ సభ్యుల ఆందోళనతో చైతన్యపురి పోలీసులలో కదిలిక వచ్చింది.. ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ భర్త, బిజెపి నాయకుడు ధీరజ్ రెడ్డి కార్యాలయానికి చైతన్యపురి పోలీసులు చేరుకున్నారు.
నిన్న జరిగిన హనుమయ్యపై దాడి ఘటనపై విచారణ నిమిత్తం పోలీసులు బీ.జె.పీ. నాయకుడు ధీరజ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ధీరజ్ రెడ్డిని ఎల్బీనగర్ ఏసీపి కార్యాలయానికి తరలించారు.. దాడికి ప్రధాన కారణం ఇద్దరి మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీలని పోలీసులు తెలిపారు.. కాగా రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగితే తప్ప పోలీసులు కేసులు నమోదు చేయలేదని దాసరి ఉషా ఆరోపించారు. అయితే తాము ఎవరిపై దాడి చేయలేదని చెబుతున్నాడు బీజెపి నాయకుడు ధీరజ్ రెడ్డి..
హనుమయ్య అనే వ్యక్తి తనను ఫోన్ లో బెదిరించారని.. ఆ సమాచారాన్ని పోలీసులకు కుడా అందించినట్లు తెలిపారు. కాగా ఈనెల ఏడో తేదీన చైతన్య పురి పోలీస్ స్టేషన్ లో హనుమయ్య , ధీరజ్ రెడ్డిలు ఇద్దరూ పరస్పరం ఫిర్యాదు చేసినట్టు అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు తెలిపారు. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

నేను ఎవరిమీదా దాడి చెయ్యలేదు :
ఆర్.కె.పురం కార్పొరేటర్ భర్త, బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డి

హనుమయ్య అనే వ్యక్తి నామీద అనవసరమైన అబాండాలు వేస్తున్నాడు.. ఆరోపణలు చేస్తూ పోలీసు కేసు పెట్టాడు.. నిజానికి సదరు హనుమయ్య అనే వ్యక్తి నా దగ్గర సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు.. కాగా అప్పగించిన కాంట్రాక్ట్ లో సగం పని మాత్రమే పూర్తి చేశాడు.. ఈ విషయం ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగి కూడా మీడియాకు వివరాలు వెల్లడించడం జరిగింది.. తాను పూర్తి చేయని పనికి నాదగ్గరికి వచ్చి పూర్తి డబ్బులు చెల్లించమని వత్తిడి తెచ్చాడు.. నా కార్యాలయం మీద దాడికి ప్రయత్నం చేశాడు.. అదే విధంగా 70 సార్లకు పైగా నాకు ఫోన్ చేసి బెదిరించాడు.. ఈ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా పోలీసులకు అప్పగించాను.. తాను సామాన్యుడిగా నటిస్తున్నాడని, ఇతని పేరుమీద, ఇతని కుటుంబ సభ్యుల పేరుమీద 740 ఎకరాల భూమి వుంది. మర్రిగూడ ప్రాంతంలో దళితుల భూములు కబ్జాలు చేశాడు.. అక్కడ కూడా అతని మీద అనేక కేసులు నడుస్తున్నాయి.. దాడి అని కేసు పెట్టిన అనంతరం కూడా చాలా సార్లు నాకు ఫోన్ చేసి బెదిరించాడు.. ఈ విషయాలన్నీ ఆధారాలతో పోలీసు అధికారులకు సమర్పించడం జరిగింది.. నేను తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది.. ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హనుమయ్యకు తెలుపుతున్నాను అన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments