- కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి
రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహణ..
బుధవారం రోజు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ దీప దాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.. కాగా ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కూడా పాల్గొన్నారు.
చలో రాజ్ భవన్ కార్యక్రమంలో నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసిసి కమిటీల సభ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


