పలు అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన..
అధికారులకు పలు సూచనలు చేసిన జెడ్.సి. హేమంతా కేశవ్ పాటిల్..
నిధులు మంజూరు చేయాలని జెడ్.సి.ని కోరిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
జోనల్ కమిషనర్ హేమంతా కేశవ్ పాటిల్, ఐఏఎస్ తో కలసి డివిజన్ లో పర్యటించారు బి యన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య కూడా పాల్గొన్నారు.. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పర్యటించడం జరిగింది.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్.జీ.ఓస్ కాలనీ, సచివాలయ నగర్ లో జరుగుతున్న ఉమెన్స్ థీమ్ పార్క్ పనులు వేగవంతం చేయాలని, పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలను, పిల్లల ఆట పరికరాలను, ప్రహరి గోడకు ఫెన్సింగ్ మరమ్మతులు, ఓపెన్ నాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని.. ఉమెన్స్ థీమ్ పార్క్ ను అత్యంత ఆధునిక పరికరాలతో అభివృద్ధి చేయాలని సూచించారు.. అలాగే రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని ఓపెన్ నాలాలలో పూడికలను తీయాలని తెలిపారు.. సాహెబ్ నగర్ స్మశాన వాటిక అభివృద్ధి చేయాలని, వీధి దీపాలు, రోడ్లు, నూతన రంగులు, మొక్కలు నాటించాలని సూచించారు..
ఇక శ్రీపురం కాలనీ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నూతన రోడ్డు నిర్మించాలని. శివారు కాలనీలలో రోడ్లు, వీధి దీపాలు, పార్కు స్థలాలకు ప్రహరీ గోడలు నిర్మించాలని.. పలు కాలనీలలో విధి దీపాలు ఏర్పాటు చేయాలని, రోడ్లు గుంతలు పడి ఇబ్బంది కరంగా ఉందని కావున వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని సూచించారు.. డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఓపెన్ జిమ్ లు, సంక్షేమ సంఘం భవనాలు, నూతన రోడ్ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ జోనల్ కమిషనర్ ని కోరడం జరిగింది. ఇందుకు సాహనుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ అతి త్వరలోనే ఒకటొకటిగా కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఈఈ రమేష్ బాబు, డీఈ దామోదర్ రావు, శానిటేషన్ డీఈ నీలిమ, జిహెచ్ఎంసి ఎలక్ట్రిక్ సిటీ డీఈ పున్నా నాయక్, ఎంటమాలజీ ఏఈ రవీందర్ రెడ్డి, ఇంజనీరింగ్ భాగం ఏఈ రాజ్ కుమార్, జిహెచ్ఎంసి అధికారులు, పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మహేష్ గౌడ్, శివశంకర్ గౌడ్, చందు, పవన్ కుమార్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..