Monday, June 23, 2025
Google search engine
Homeహెల్త్జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ పళ్ళు తినాలి..

జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ పళ్ళు తినాలి..

వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల ఎవ‌రికైనా స‌రే స‌హ‌జంగానే మ‌తిమ‌రుపు వ‌స్తుంటుంది. జ్ఞాప‌క‌శక్తి, ఏకాగ్ర‌త కూడా త‌గ్గిపోతుంటాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రు మెద‌డును యాక్టివ్‌గా ఉంచుకోవాలి. చిన్న‌త‌నంలో అయితే చ‌దువుకుంటారు క‌నుక మైండ్ యాక్టివ్‌గా మారి షార్ప్ అవుతుంది. దీంతో ఏ విష‌యాన్ని అయినా స‌రే ఇట్టే గుర్తు పెట్టుకుంటారు. కానీ వ‌య‌స్సు మీద ప‌డేకొద్దీ జ్ఞాప‌క‌శ‌క్తి స‌న్న‌గిల్లుతుంది. దీంతో వృద్ధాప్యంలో చాలా మంది అల్జీమ‌ర్స్ బారిన ప‌డుతుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో త‌మ పేరునే తాము గుర్తు పెట్టుకోలేక‌పోతారు. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మెద‌డును యాక్టివ్‌గా ఉండేలా చేయ‌వ‌చ్చు. ఇవి మెద‌డును ఉత్తేజంగా మారుస్తాయి. యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. వీటిని తింటే మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. ఈ ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల ప‌లు ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి.

వారంలో క‌నీసం రెండు సార్లు చేప‌ల‌ను తింటే మ‌తిమ‌రుపు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఎందుకంటే చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, డీహెచ్ఏ, ఈపీఏ ఉంటాయి. ఇవి మెద‌డు క‌ణాల‌ను నిర్మిస్తాయి. దీనివ‌ల్ల మెద‌డు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా ప‌నిచేస్తుంది. జ్ఞాప‌కశ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల సెరొటోనిన్ అనే హార్మోన్ ఉత్ప‌త్తి సైతం పెరుగుతుంది. ఇది మైండ్‌ను ప్ర‌శాంతంగా ఉంచుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మైండ్ రిలాక్స్ అయి రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర‌ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. క‌నుక చేప‌ల‌ను తర‌చూ తింటుంటే మెద‌డును యాక్టివ్‌గా ఉంచుకోవ‌చ్చు.

ఆకుకూర‌ల‌ను తిన‌డం అంటే చాలా మందికి ఇష్టం ఉండ‌దు. కానీ ఆకుకూర‌ల‌ను తింటే మెదడు యాక్టివ్‌గా మారుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆకుకూర‌ల్లో ముఖ్యంగా పాల‌కూర‌, తోట‌కూర వంటివి తింటే విట‌మిన్లు ఎ, కె ల‌భిస్తాయి. ఇవి వాపుల‌ను త‌గ్గిస్తాయి. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి. ది ఫెడ‌రేష‌న్ ఆఫ్ అమెరిక‌న్ సొసైటీస్ ఫ‌ర్ ఎక్స్‌ప‌రిమెంట‌ల్ బ‌యాల‌జీకి చెందిన ప‌రిశోధ‌కులు చేసిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. ఆకుకూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల విట‌మిన్ కె, బీటా కెరోటిన్‌, ఫోలేట్‌, లుటీన్ ల‌భిస్తాయి. ఇవి మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రిచి మెద‌డును యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. క‌నుక వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు ఆకుకూర‌ల‌ను తినేలా ప్లాన్ చేసుకోండి. దీంతో మెద‌డు యాక్టివ్‌గా మారి చురుగ్గా ఉంటుంది.

మ‌న శ‌రీరంలోని అవ‌య‌వాలు స‌రిగ్గా ప‌నిచేసేందుకు వాటికి శ‌క్తి కావ‌ల్సి ఉంటుంది. అయితే ఇందుకు మెద‌డు ఏమీ మిన‌హాయింపు కాదు. దానికి కూడా శ‌క్తి కావాలి. మెద‌డు ఎక్కువ‌గా గ్లూకోజ్ మీద ఆధార ప‌డుతుంది. దీంతో ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శక్తి స‌రిగ్గా ఉంటాయి. మెద‌డు కొత్త స‌మాచారాన్ని సేక‌రిస్తుంది. అయితే మెద‌డుకు శ‌క్తి అందించేందుకు గాను తృణ ధాన్యాల‌ను తింటే మంచిది. ముఖ్యంగా బ్రౌన్ బ్రెడ్‌, బ్రౌన్ రైస్‌, మిల్లెట్స్‌, ఓట్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. ప‌రిశోధ‌కులు చెబుతున్న ప్ర‌కారం తృణ ధాన్యాల‌ను తిన‌డం వ‌ల్ల వ‌య‌స్సు మీద ప‌డిన‌ప్పుడు అల్జీమ‌ర్స్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. మెద‌డు వాపుల‌కు గురి కాకుండా ఉంటుంది. క‌నుక తృణ ధాన్యాల‌ను కూడా తినాల్సి ఉంటుంది.

అలాగే కోడిగుడ్లు, డార్క్ చాక్లెట్లు, న‌ట్స్‌, ప‌సుపు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు వంటి ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మెద‌డు యాక్టివ్‌గా మారి చురుగ్గా ప‌నిచేస్తుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. ఇలా ఈ ఆహారాల‌ను తింటే మెద‌డును ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

( అంతర్జాలం నుండి సేకరించబడింది.. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments