మనవి చేసిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..
మంగళవారం రోజు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో హైదరాబాద్ జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఐఏఎస్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్ కార్యక్రమంలో బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో రోడ్ల కొరకు నిధులు మంజూరు చేయాలని, శివారు కాలనీలా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పలు కాలనీలలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, కాలనీలో పారిశుధ్యం కోసం ఇప్పుడున్న కార్మికులు సరిపోవడం లేదని.. కావున నూతన కార్మికులను నియమించాలని, రానున్న వర్షాకాలం అని దృష్టిలో పెట్టుకొని మాన్సూన్ అత్యవసర సిబ్బంది ఏర్పాటు చేయాలని, కాలనీలలో ఖాళీగా ఉన్న పార్కు స్థలాలు కబ్జాకు గురికాకుండా ఉండేందుకు ప్రహరి గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గ కార్పొరేటర్లు, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు..