Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణడివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పరిశీలన..

డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పరిశీలన..

కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

హయత్ నగర్ డివిజన్ లోని బ్లడ్ బ్యాంక్ కాలనీ, ఖాదీ బోర్డు కాలనీ, కమర్షియల్ టాక్స్ కాలనీలో జరుగుతున్న నూతన భూగర్భ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం రోజు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అధికారులతో కలసి పరిశీలించారు.

ఈ సందర్బంగా కాలనీవాసులు నూతన భూగర్భ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కాలనీలో మిగిలి ఉన్న వీధుల్లో కూడా పూర్తిస్థాయిలో నూతన భూగర్భ డ్రైనేజ్, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కి విజ్ఞప్తి చేశారు.. రాబోవు కాలంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్ అధికారులకు తెలుపడంతో పాటు, దశలవారీగా పటిష్టమైన ప్రణాళికతో డివిజన్ శివారులో ఉన్నటువంటి కాలనీల అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో ఏఈ హేము నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్, బీజేపీ మల్కాజ్గిరి పార్లిమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, బ్లడ్ బ్యాంక్ కాలనీ అధ్యక్షులు నరసింహారెడ్డి, మాధవ రెడ్డి, జంగారెడ్డి, రమేష్, మల్లేష్, సుధాకర్ రెడ్డి, వివిధ కాలనీలలోని తదితరులు పాల్గొన్నారు..

ఇక అదే విధంగా హయత్ నగర్ డివిజన్ లోని మహేశ్వరి కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులతో కలసి లెవెల్స్ పరిశీలించారు. వెంటనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని, కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విశాలంగా ఉండే విధంగా, లెవెల్స్ సరి చూసుకుంటూ సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన ఏఈ హేము నాయక్ కి ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, మహేశ్వరి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు కూడా పాల్గొన్నారు..

మరో కార్యక్రమంలో తొర్రూర్ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసినా బెల్లంచాయి ప్రారంభోత్సవంలో కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని నిర్వాహకులు మహేష్, హరి క్రిష్ణ లకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లం చాయి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటిస్తూ కస్టమర్లకు రుచికరమైన, ఆరోగ్యవంతమైన చాయి అందించాలని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments