కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య..
హయత్ నగర్ సర్కిల్ పలు వార్డులలో పర్యటన..
జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు రుతుపవనాల సీజన్ ప్రారంభానికి ముందు డిసిల్టింగ్ పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని గురువారం రోజు హయత్ సర్కిల్ లోని నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్, బి.యన్ రెడ్డి నగర్ వార్డులలో జరుగుతున్న డిసిల్టింగ్ పనులను హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య పరిశీలించారు..
నాగోల్ డివిజన్ లోని ఆదర్శ నగర్ కాలనీ.. మన్సూరాబాద్ డివిజన్ లోని సహారా ఎస్టేట్స్.. హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీ..
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ లో గౌతం నగర్ లో పర్యటించి జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది. మొత్తం పొడవు – 9.71 కిలోమీటర్లు.. పూర్తయింది – 9.10 కిలోమీటర్లు.. పురోగతిలో ఉన్న పని 0. 61కిలోమీటర్లుగా అధికారులు తెలిపారు..
కార్టింగ్ చేసిన సిల్ట్ వెంట వెంటనే తొలగించడం జరుగుతుందని తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. రమేష్ బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బి. కనకయ్య, పి. దామోదర్, అసిస్టెంట్ ఇంజనీర్లు లక్ష్మీ దీపక్, స్వప్న, హేము నాయక్, రాజ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.