పెను ప్రమాదాన్ని తప్పించిన ట్రాఫిక్, హైడ్రా, ఫైర్ విభాగాలు
ఒక ఆయిల్ ట్యాంకర్ తిరగబడింది.. కానీ వెంటనే స్పందించిన హైడ్రా, ఫైర్ విభాగాలు పెను ప్రమాదాన్ని తప్పించాయి.. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ రైలు నిలయానికి చేరువలోని ఆలుగడ్డ బావి వద్ద సోమవారం ఉదయం 11.45 గంటల సమయంలో పెట్రోల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది.. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి..

ట్రాఫిక్ను దారి మల్లించి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకున్నారు.. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ట్యాంకర్ పేలి పెనుప్రమాదం జరిగే అవకాశం ఉండేది.. ట్యాంకర్ నుంచి లీకైన పెట్రోల్, డీజిల్కు మంటలు అంటుకోకుండా ఫైర్ ఇంజిన్లద్వారా నిరంతరాయంగా నీళ్లు చల్లాయి ఫైర్, డీఆర్ ఎఫ్ బృందాలు. ఫోమ్ను వెదచల్లి, ఇసుక పోసి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.. భారీ క్రేన్లను తీసుకు వచ్చి ఎక్కడా స్పార్క్ రాకుండా ట్యాంకర్ను నిలబెట్టారు.. ఎలాంటి ప్రమాదానికి ఆస్కారం లేకుండా గంటలో పని పూర్తి చేసిన బృందాలు.
