తెలంగాణ పదో తరగతి తరగతి పరీక్షల షెడ్యూల్ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది. తాజాగా ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 21వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24వ తేదీన ఇంగ్లీష్, మార్చి 26వ తేదీన మ్యాథ్స్, మార్చి 28వ తేదీన ఫిజిక్స్, మార్చి 29వ తేదీన బయాలజీ, ఏప్రిల్ 2వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Telangana 10th Time Table 2025
మార్చి 21 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24 – ఇంగ్లీష్
మార్చి 26 – మ్యాథ్స్
మార్చి 28 – ఫిజిక్స్
మార్చి 29 – బయాలజీ
ఏప్రిల్ 2 – సోషల్ స్టడీస్