పనులను పరిశీలించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటానని హామీ..
హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గురువారం డివిజన్ లోని దుర్గా నగర్ కాలనీలో జరుగుతున్న నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను సంబంధిత సిబ్బందితో, కాలనీవాసులతో కలిసి పరిశీలించడం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోవు కాలంలో కాలనీవాసులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని సంబంధిత సిబ్బందికి తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు వెంకటనారాయణ, శ్రీనివాస్, వీరస్వామి, లింగస్వామి, శంకర్, వెంకటేష్, నగేష్, గణపతి రావు, కాలనీ మహిళలు, తదితరులు పాల్గొన్నారు..
