( ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషిచేసి దిశగా చర్యలు.. )
- ఏవీ రంగనాథ్, పీ. విశ్వప్రసాద్ ల ఆధ్వర్యంలో మీటింగ్..
- ముఖ్యమైన పాయింట్లను పొందుపరచిన అధికారులు..
హైదరాబాద్, 17 అక్టోబర్ :
గురువారం రోజు హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం నివారణ కోసం నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ కార్యాయలయంలో సమీక్ష నిర్వహించారు.. కాగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్ లు సంయుక్తంగా ఈ సమీక్ష నిర్వహించారు.. హైడ్రా అధికారులు, ట్రాఫిక్ విభాగానికి చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు.. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లను ప్రతిపాదించారు.. .
ఈ క్రమంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది.. ట్రాఫిక్ విభాగంతో కలసి పని చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది.. హైడ్రాకు చెందిన డీఆర్ ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నింయత్రణపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారు.. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు లేని ముఖ్యమైన సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులతో కలసి హైడ్రా డీఆర్ ఎఫ్ బృందం కలిసి పని చేసేలా ఏర్పాట్లు. రెండు విభాగాలు కలసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. ముఖ్యమైన సమయాల్లో హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దించి ట్రాఫిక్ను క్లియర్ చేసే విధంగా చర్యలు చేపట్టనున్నారు.. వర్షం పడినప్పుడు వరద నీరు చేరే ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టి నీటిని తొలగించేందుకు డీఆర్ ఎఫ్ బృందాలతో ట్రాఫిక్ పోలీసులు కలిసి పని చేసేలా చర్యలు..

ఇరు శాఖలు గుర్తించిన వాటర్లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.. వెంటనే నీరు తొలిగించేలా హార్సు పవర్ ఎక్కువ ఉన్న మోటర్ల వినియోగం. ఆ నీటిని ఎక్కడకు తోడాలనేదానిపై చర్చ. శాశ్వత పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించారు.. వరద కాలువలు, పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం. కొత్త లైన్లను వేసి వరదకు శాశ్వత పరిష్కారం చూపడం. నగరంలో 144 వాటర్ లాగింగ్ పాయింట్లుంటే 65 హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ప్రాధాన్య క్రమంలో ఈ సమస్యను పరిష్కరించడం. ప్రధాన రహదారులతో పాటు.. కాలనీల్లో ఫుట్పాత్లను ఆక్రమించి ఉన్న శాశ్వత దుకాణాలను తొలగించడంపై దృష్టి.. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫుట్పాత్లను, రహదారులను ఆక్రమించి దుకాణాలు ఏర్పటు చేసి వ్యాపారులకు సమాచారం ఇచ్చి వాటిని తొలగించడం. హైడ్రా, జీహెచ్ ఎంసీ, ట్రాఫిక్ విభాగాలు సంయుక్తంగా పని చేసి.. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. నగర ప్రజలు సాఫీగా నడచుకుని వెళ్లే విధంగా ఫుట్పాత్లను రూపొందించడం.
ఫుట్పాత్ల మీద ప్రభుత్వ విభాగాలకు చెందిన ట్రాన్స్ఫార్మర్లు, టెలిఫోన్ డక్లు, జీహెచ్ ఎంసీ చెత్త డబ్బాలు లేకుండా ఆయా విభాగాలతో వాటిని తొలగించేలా చర్యలు చేపట్టడం.. కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లను, కొమ్మలను గుర్తించి వాటిని తొలగించడం. ట్రాఫిక్, వరద నీటి సమస్య ఉత్పన్నమైనప్పడు ప్రాంతాలవారీ స్పందించే బృందాల సమాచారం ప్రజలకు తెలిసేలా ఏర్పాట్లు. ప్రజల భాగస్వామ్యంతో ట్రాఫిక్ ఫ్రీ నగరం లక్ష్యం. ఇక ముఖ్యంగా నెలకోసారి హైడ్రా – ట్రాఫిక్ విభాగాలు సమావేశమై.. చేపట్టిన, చేయాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది..