దిగజారిన జైస్వాల్, విరాట్ కోహ్లీ ర్యాంకులు..
ఐసీసీ టెస్ట్ ర్యాంకులను బుధవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాపై సెంచరీలు చేసిన యశస్వీ జైస్వాల్తో పాటు విరాట్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. జైస్వాల్ ర్యాంక్ నాల్గో స్థానానికి చేరగా.. విరాట్ కోహ్లీ ర్యాంక్ 14వ స్థానానికి పడిపోయింది. ఇక మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ నెంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నది. ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్నది. పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. పెర్త్ టెస్ట్లో యశస్వీ జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. 22 ఏళ్ల బ్యాట్స్మెన్ రెండో ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 161 పరుగులు చేశాడు. టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో జైస్వాల్ 825 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం సెకండ్ ప్లేస్కి హ్యారీ బ్రూక్ చేరుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ పెర్త్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 689 రేటింగ్ పాయింట్లతో 14వ స్థానానికి చేరుకున్నాడు.
పెర్త్ టెస్టులో రిషబ్ పంత్ బ్యాట్ రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 37 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. అయితే, ర్యాంకింగ్లో ఎలాంటి ప్రభావం కనిపించలేదు. ప్రస్తుతం 736 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం టాప్-10లో కేవలం కేవలం పంత్, జైస్వాల్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం టెస్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 895 పాయింట్లతో ఉన్నాడు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నెంబర్ వన్గా కొనసాగుతుండగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా టాప్ 10లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో ఆడిన తొలిమ్యాచ్లో బుమ్రా మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో అశ్విన్కు విశ్రాంతినిచ్చారు. అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపరుచుకొని ఆరో స్థానానికి చేరుకున్నాడు.