పెద్ద చెరువులో వెలసిన విల్లాలపై చర్యలు.
హైడ్రా మరోసారి తన పంజాను విసురుతోంది.. రంగారెడ్డి జిల్లా, మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ లోని పెద్ద చెరువులో నిర్మించిన విల్లాలను హైడ్రా కూల్చివేసింది.. పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవెల్ , బఫర్ జోన్లలో వెలిసిన విల్లాల అనుమతులు రద్దు చేసినా నిర్మాణాలు ఇంకా కొనసాగడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్. ఎఫ్.టి.ఎల్. పరిధిలో వున్నాయని గతంలో కొన్నిటిని కూల్చినట్లు ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు వివరణ ఇచ్చారు.. మున్సిపాలిటీ, ఇరిగేషన్ నోటీసులు పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగడంపై కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది.. శుక్రవారం ఉదయం కూల్చివేతలు ప్రారంభించిన హైడ్రా అధికారులు. రెండు విల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు వుండడంతో.. కోర్టుకు సమాచారం యిచ్చి కూల్చివేతకు హైడ్రా చర్యలు. మొత్తం 13 విల్లాలు కాగా.. ఒక్కొక్కటి 400 గల విస్తీర్ణంలో ఒన్ ప్లస్ టూ గా నిర్మాణం జరుపుకున్నాయి..
