కోహెడ రెవెన్యూ పరిధి గండి చెరువు గ్రామంలో పర్యటన..
20 నుంచి 30 శాతం పంట నష్టం జరిగిందని తెలిపిన వ్యవసాయ అధికారి..
అకాల వర్షానికి నేలరాలిన పంట గురించి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ చారి స్వయంగా వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చారు.. ఈ సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు కోహెడ రెవెన్యూ పరిధిలోని గండి చెరువు గ్రామానికి విచ్చేసి నష్టాన్ని అంచనా వేశారు.. ఈ క్రమంలో వ్యవసాయ అధికారి వరి పంట తోపాటు, కూరగాయల పంటలు దెబ్బతినడం పరిశీలించారు.. కాగా స్థానిక వైస్ చైర్మన్ భాస్కర్ చారి, ఏ ఈ ఓ రఘు, గ్రామ రైతులతో కలిసి అధికారి పంట పొలాలను పరిశీలించడం జరిగింది. 20స్ నుంచి 50 శాతం వరకు పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారి రఘు తెలిపారు.. దాదాపుగా 20 ఎకరాల పంట నష్ట అంచనా వేశారు.. ఈదురు గాలులకు మామిడి చెట్లు, తాడిచెట్లు విరిగి పడిపోవడం కూడా అధికారులు పరిశీలించారు..