రోజు రోజుకూ మానవత్వం మంటగలిసిపోతోంది..
దోషులను కఠినంగా ఊరకే వదిలిపెట్టకూడదు..
డిమాండ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసిన జస్టిస్ బీ. చంద్ర కుమార్..
నిరసన చేపట్టి, కొవ్వొత్తులు వెలిగించిన సీనియర్ సిటీజన్స్..
కాశ్మీర్ పెహల్గాన్ లో జరిగిన హత్యాకాండకు నిరసనగా.. హస్తినాపురం సెంటర్ లో సీనియర్ సిటిజన్స్ గురువారం రోజు సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి మారణకాండలో మృతిచెందిన వారికి ఘనంగా నివాళి అర్పించారు. ఇది అత్యంత క్రూరమైన చర్య. ఇది మానవత్వానికి తీరని మచ్చ. దోషులను కఠినంగా శిక్షించాలని వారందరూ డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో జస్టిస్ బీ.చంద్రకుమార్, ఎన్వి సుబ్బారాయుడు, ఎస్. సాంబయ్య, కొండారెడ్డి, విట్టల్, రాజలింగం, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు..