అట్టగుడు వర్గాల అభివృద్ధికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కేఎల్ఆర్..
సమసమాజ నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.
ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పెంపు, రాజీవ్ యువ వికాసం మూడు కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోనున్నాయని కిచ్చెన్న అన్నారు.
తుక్కుగూడ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలను అన్ని రంగాల్లో రాణించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ, బీసీ 42శాతం రిజర్వేషన్ల బిల్లులకు చట్టబద్దత కల్పించారని కొనియాడారు.
ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఒక్క అగ్రవర్ణాలే కాకుండా అన్ని వర్గాలు రాణించేలా స్కిల్ యూనివర్శిటీని నెలకొల్పుతున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం తరపున సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కేఎల్ఆర్.. బీసీలకు రాజకీయాల్లోనూ 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఈ రెండు బిల్లులు కేంద్రం ఆమోదించాలని కేఎల్ఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళానేతలు పాల్గొన్నారు.