Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణప్రజా సంబంధిత కార్యక్రమాలతో బిజీగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

ప్రజా సంబంధిత కార్యక్రమాలతో బిజీగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

కార్పొరేటర్ ని కలిసిన డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు..
వరద నీటి కాలువను అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్..
సి సి రోడ్ల పనులను పరిశీలించిన కళ్లెం నవజీవన్ రెడ్డి..

హయత్ నగర్ డివిజన్లోని డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మంగళవారం రోజు స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కాలనీలోని రోడ్. నెంబర్ : 3 పార్క్ లో హై మాక్స్ లైట్, గ్రీనరీ ఏర్పాటు చైయాలని, అదే విధంగా కాలనిలోని పలు విధుల్లో పూర్తిస్థాయిలో భూగర్భ డ్రైనేజ్, సీసీ రోడ్ల సదుపాయం లేకపోవడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారని తెలపడంతో కార్పొరేటర్ స్పందించి సంబంధిత అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా డిఫెన్స్ కాలనీవాసుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులకు వారు హామీ ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సత్తి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వాసు గౌడ్, ఆలయ కమిటి లక్ష్మణ్, సంక్షేమ సంఘం సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, లచ్చి రెడ్డి, భజన్ నాయక్, సందీప్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాగేశ్వర్ రావు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు..

ఇక మరో కార్యక్రమంలో అధికారులతో కలిసి వరద నీటి కాలువ నిర్మాణానికి లెవెల్స్ పరిశీలించారు కార్పొరేటర్.. హయత్ నగర్ డివిజన్ లోని జేష్పాల్ ఫర్నిచర్ వద్ద నుండి బంజారా కాలనీ కల్వెర్ట్ వరకు నిర్మిస్తున్న వరద నిట్టి కాలువ నిర్మాణ పనులు గతంలో నిధుల కొరత వల్ల మధ్యలో ఆగిపోవడం, ఇపుడు వరద నీటి కాలువ పూర్తిస్థాయిలో నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి జీ హెచ్ ఎం సి అధికారులతో కలిసి లెవెల్స్ పరిశీలించడం జరిగింది. అదే విధంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని వారు అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ రమేష్ బాబు, డీఈ దామోదర్, ఏఈ హేము నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు..

ఇంకొక కార్యక్రమంలో భాగంగా జీ.హెచ్.సి. ఉన్నత అధికారులతో కలిసి సీసీ రోడ్ల సమస్యను పరిశీలించారు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.. డివిజన్లోని షిరిడి నగర్ కాలనీలో పర్యటించి సీసీ రోడ్ల సమస్యను పరిశీలించారు . ఈ సందర్భంగా కాలనీవాసులు కాలనీలోని పలు వీధుల్లో సిసి రోడ్ల సదుపాయం లేకపోవడంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నపాటి వర్షానికి కాలనీ రోడ్లన్నీ బురదగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని కాలనీవాసులు వివరించడంతో, వీలైనంత త్వరగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో ఈఈ రమేష్ బాబు, డీఈ దామోదర్, ఏఈ హేము నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments