కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ పీ. సరస్వతి..
మంగళవారం ఉదయం 10.30 నిమిషములకు ఎన్.ఏ.ఎం.ఏ.ఎస్.టి.ఈ. ( నమస్తే ) ( నేషనల్ ఆక్షన్ ఫర్ మెకనైజ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ ) కార్యక్రమాలలో భాగంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవగాహన సదస్సు వర్క్ షాప్ ఏర్పాటు నిర్వహించడమైనది.. ఇట్టి కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కమీషనర్ పి.సరస్వతి.. పాగోన్నారు.. ఇక నమస్తే కార్యక్రమాలలో భాగంగా జెన్ రోబోటెక్, కేరళ సంస్థ వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సానిటేషన్ సంబందించి మౌళికీకరణ, రక్షణ చర్యలు, సిబ్బంది సంక్షేమం గురించి మాట్లాడుతూ.. ఇట్టి కార్యక్రమంలో సానిటేషన్ సిబ్బందికి.. ఆరోగ్య పరమైన సేఫ్టీ కిట్స్, సేఫ్టీ ఎక్యుప్మెంట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సబ్సిడీ.. వృత్తిపరమైయన అంశాలపై ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.. సఫాయి వర్కర్స్కు పీపీఈ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది..
ఇట్టి కార్యక్రమంలో ఏ.ఎం.సి. శ్యాంసుందర్, మేనేజర్ బి. నాగేశ్వర రావు, డిప్యూటీ ఈ ఈ పి. వెంకన్న, ఆర్.ఓ. వేణు గోపాల్, శానిటరీ ఇన్స్పెక్టర్ వంకాయల యాదగిరి, ఈ ఈ డి. మౌనిక, శానిటేషన్ సెక్షన్ యం. హనుమంతు, కంప్యూటర్ ఆపరేటర్, సెక్షన్ ఆసిస్టంట్ సి.హెచ్ భాగ్యలత, శానిటేషన్ జవాన్లు, కామాటీలు, కార్యాలయ సిబ్బంది, వార్డు అధికారులు పాల్గొన్నారు.