మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 31వ డివిజన్ బాలాజీ నగర్ లో.. ముదిగొండ లక్ష్మి ఇంట్లో ఇటీవల షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు దగ్ధం అయిన సంగతి విదితమే.. ఈ విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరిశీలించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.. ఈ కార్యక్రమంలో డీఈఈ నర్సింహ రాజు, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం సంతోష శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గట్టు బాలక్రిష్ణ, కొండ శ్రవణ్ కుమార్ యాదవ్, దురెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.