సామాజిక న్యాయం కోసం పరితపించే బీసీల ముద్దుబిడ్డ )
బీసీలకు నేనున్నాననీ అభయమిచ్చే మహా మనీషి..
బీసీ ఉద్యమాల్లో సరికొత్త ఒరవడి సృష్టించిన మేధో సంపత్తి..
చిరంజీవులుని కొనియాడిన ఓబీసీ, జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వేముల కొండల్ గౌడ్..
దాదాపుగా ఒక సంవత్సరం నుండి రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ బీసీలకు నేను ఉన్నానని, వివిధ రంగాలలో ఎలా నష్టపోయారో ఈ లోకానికి చూపిస్తూ శాస్త్రీయమైన ఆధారాలతో, సరైన లెక్కలతో బీసీ ఉద్యమాలలో సరికొత్త వరవడి సృష్టిస్తున్నారు తోగర్ల చిరంజీవులు అని కొనియాడారు ఓబిసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వేముల కొండల గౌడ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1982 గ్రూప్ 2లో టాప్ ర్యాంకర్ గా ఉద్యోగ బాధ్యతలోకి వచ్చి,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాలలో ఉద్యోగం నిర్వహిస్తున్న సందర్భంలో పేదల ఇంటికి నేరుగా వెళ్లి ఎస్.ఆర్ శంకరన్ మాదిరిగా సంక్షేమం అందించిన ఘనత చిరంజీవులుది. హెచ్ఎండిఏ కమిషనర్ గా నగరంలో హెచ్ఎండిఏ ఆస్తులను కబ్జా కోర్ల నుండి సుప్రీంకోర్టు దాకా వెళ్లి.. ఔటర్ రింగ్ రోడ్డు పనులు పూర్తి చేయించి మిగతా రైతులను ఒప్పించి, కొండాపూర్, నానక్ రామ్ గూడ, మూసి ప్రక్కన ఉన్న ఉప్పల్ బాగయత్ లేఔట్ చేసి, అనేక డిపార్ట్మెంట్లలో పనిచేసి, ప్రభుత్వాలకు ఆదాయాలు తెచ్చిపెట్టిన ఘనత చిరంజీవులుది. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ మాదిరిగా కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని, బీసీ సంఘాలన్నిటినీ ఒక తాటిపైకి తెస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తూనే, కులగణన కొరకు ప్రభుత్వ పెద్దలను ఒప్పించి.. ప్రత్యేక బడ్జెట్ పెట్టించి, సర్వేలో కొన్ని తప్పులు జరిగితే రీ సర్వే చేయించిన ఘనత ఈయనది.. ఢిల్లీ నగరంలో కేంద్ర ప్రభుత్వంపై 23 మంది ఎంపీలు,18 పార్టీలతో ఢిల్లీ నడిబొడ్డున జాతీయస్థాయిలో బీసీలకు జనగణనలో కులగణన ఫార్మాట్ ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ పోరు గర్జనలో కూర్చోబెట్టాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేసి స్పందించి కుల గణన చేస్తామని ప్రకటించింది. దాదాపుగా బీసీలకు అభినవ అంబేద్కర్ లాగా అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి చిరంజీవులు అని కొనియాడారు. అంతే కాకుండా సార్ ఆధ్వర్యంలో 2028 బీసీలకు ఒక రాజకీయ పార్టీ వస్తుందని, రాజ్యాధికారానికి దగ్గర్లో ఉన్నామని అన్నారు..