వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
మొదలైన హాస్పిటల్ పునర్నిర్మాణ కార్యక్రమం..
శనివారం రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీపురం కాలనీ, బృంగి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బృంగి శిరీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.. ఈ సందర్భంగా బృంగి హాస్పటల్ ను పునర్నిర్మాణం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొనడం జరిగింది..
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. డాక్టర్ బృంగి సురేష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. హాస్పటల్ పునర్నిర్మాణం చేసి నూతనంగా మార్చి 100 పడకల హాస్పిటల్ మార్చడం చాలా సంతోషకరమని అన్నారు.. హాస్పిటల్ కి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.. త్వరలోనే మరొక హాస్పిటల్ ప్రారంభించి నిరుపేదలకు నాణ్యమైన ధరలకే వైద్యం అందించాలని కార్పొరేటర్ ఆశించారు..
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, హాస్పిటల్ స్టాఫ్, తదితరులు పాల్గొన్నారు.